ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసి బస్సులు నడపడానికి గానూ ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సామాజిక దూరం పాటిస్తూ మాత్రమే బస్సులను నడపాలి అని సిఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తెలంగాణా తో కూడా మాట్లాడి వాళ్ళు అంగీకరిస్తే సర్వీసులను నడపాలని జగన్ అధికారులకు సూచించారు. 

 

బస్సు సర్వీసులపై విధి విధానాలను రూపొందించాలి అని జగన్ ఆదేశించారు. ప్రైవేట్ బస్సులకు కూడా అనుమతి ఇవ్వాలని ప్రతీ ఆర్టీసి బస్సులో 20 మంది మాత్రమే ఉండాలని, బస్సుల్లో ప్రయాణించే వారికి కచ్చితంగా మాస్క్ ఉండాలని జగన్ సూచించారు. అప్పుడు పరిస్థితి ఆధారంగా బస్సు సర్వీసులను నడపాలి అని జగన్ అధికారులకు సూచనలు చేసారు. త్వరలోనే బస్సులను నడపాలని అధికారులకు ఆయన సూచనలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: