ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతూనే ఉంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో ప్రభుత్వం తీరుని ఇప్పుడు పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయితే తమ తప్పు ఏమీ లేదు అని బాధ్యులు ఎవరు అయినా సరే తాము ఆదుకుంటామని సిఎం జగన్ తాజాగా స్పష్టం చేసారు. 

 

ఇప్పుడు సిఎం జగన్ ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. బాధితుల ఆరోగ్యం భవిష్యత్తులో కూడా కంపెనీ చూసుకోవాలని జగన్ సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయని ఇక కంపెనీ మీద పెద్ద కేసులను నమోదు చెయ్యాలని ఏ విధంగా కూడా ఉపేక్షించవద్దు అని ఆయన అధికారులకు కూడా స్పష్టంగా చెప్పారని తెలుస్తుంది. బాధితులకు అవసరం అయితే పరిహారం పెంచే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: