కరోనా వైరస్ ని అత్యంత సమర్ధవంతంగా ఎదుర్కొన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటికి. బెంగళూరు లాంటి అంతర్జాతీయ స్థాయి నగరం ఉన్నా సరే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యురప్ప చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని రాష్ట్రంలో కరోనా వైరస్ ని పూర్తి స్థాయిలో కట్టడి చేసారు. అయితే ఇప్పుడు అక్కడ భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. 

 

30 లేదా 40 కేసులు మాత్రమే నమోదు అయిన రాష్ట్రంలో ఇప్పుడు వంద కేసుల వరకు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 99 కరోనా కేసులు నమోదు అయ్యాయి అని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,246కు చేరిందని, 37 మంది మృతి చెందారని పేర్కొంది. దీనిపై ఇప్పుడు ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: