తెలంగాణాలో కేబినేట్ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర సిఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేసారు. తెలంగాణా లో లాక్ డౌన్ ని మరో రెండు రోజులు పెంచుతున్నామని ఆయన పేర్కొన్నారు. మే 31 వరకు తెలంగాణాలో లాక్ డౌన్ ని పెంచినట్టు చెప్పారు. కంటైన్మేంట్ మినహా అన్ని ప్రాంతాలు గ్రీన్ జోన్ లే అని ఆయన స్పష్టం చేసారు. 

 

1452 కుటుంబాలు కంటైన్మేంట్ జోన్ లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ జోన్ లో ఉన్న వారికి మాత్రం సరుకులు ప్రభుత్వమే అందిస్తుంది అని ఆయన పేర్కొన్నారు. ఆ జోన్ లో ఉన్న వారిని బయటకు అనుమతించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేసారు. అక్కడ ఏదీ అనుమతించేది లేదని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: