తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఈరోజు 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినా గత వారం రోజుల నుంచి రాష్ట్రంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతూ ఉండగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు చేరుకున్న వలస కార్మికులు కరోనా భారీన పడుతున్నారు. 
 
ఈరోజు నమోదైన కేసుల్లో 26 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదు కాగా 12 మంది వలస కార్మికులు కరోనా భారీన పడ్డారు. గత కొన్ని రోజులుగా కేసులు నమోదు కాని మేడ్చల్ జిల్లాలో తాజాగా మూడు కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1592కు చేరింది. రాష్ట్రంలో 1002 మంది డిశ్చార్జి కాగా 556 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: