జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు మన భద్రతా బలగాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఏ విధంగా కూడా వారిని ఉపేక్షించడం లేదు. కాశ్మీర్ ని ప్రశాంతంగా ఉంచే విధంగా అడుగులు వేస్తున్న భారత ఆర్మీ నిఘా వర్గాల సహకారంతో వరుసగా ఉగ్రవాదులపై దాడులు చేస్తున్నాయి. తాజాగా మరోసారి ఉగ్రవాదులను భారత ఆర్మీ టార్గెట్ చేసింది. 

 

శ్రీనగర్ ప్రాంతంలోని నావకడాల్ ప్రాంతంలో ఉగ్రవాదులకు భారత బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎంత మంది మరణించారు అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇక ఆ ప్రాంతంలో పూర్తిగా ఇంటర్నెట్ సర్వీసులను కేంద్రం ఆపేసింది. ఇక అక్కడ భారీగా బలగాలను మోహరించింది ఆర్మీ. ఈ ఘటన లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: