ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నుంచి అతని భార్య అలియా విడాకులు కోరుతుంది. ఈ మేరకు అతనికి నోటీసులు ఇచ్చింది ఆమె. లాక్‌డౌన్‌ అమల్లో ఉంది కాబట్టి ఇ-మెయిల్‌, వాట్సాప్‌ల ద్వారా ఈ మేరకు మే 7న నోటీసులు పంపించాం అని ఆమె తరుపు లాయర్ వివరించారు. ఆమె నుంచి విడిపోయిన తర్వాత చెల్లించే భరణం గురించి కూడా ప్రస్తావించాం అని... 

 

నవాజుద్దీన్‌, ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని అందుకే ఈ విడాకులు కోరినట్టు వివరించారు. లీగల్‌ నోటీసులకు నవాజుద్దీన్‌ ఇంతవరకు స్పందించ లేదని ఆయన పేర్కొన్నారు. ఆయనకు ఇది రెండో వివాహం. అంతకు ముందు ఆయన ఒకరితో వివాహ బంధం తెగ తెంపులు చేసుకున్నారు. కాగా ఆయన ఇప్పుడు హోం క్వారంటైన్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: