దేశ వ్యాప్తంగా వలస కార్మికులు వరుస రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కడో ఒక చోట ఏదోక ప్రమాదం వారి ప్రాణాలను తీసుకుంటూ నే ఉంది. నడిచి వెళ్తున్నా బస్సుల్లో వెళ్తున్నా సరే ఏదోక ప్రమాదం వారిని బాగా ఇబ్బంది పెడుతుంది. తాజాగా మహారాష్ట్రలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

 

ఈ ప్రమాదంలో చనిపోయింది వలస కూలీలే. ఈ రోజు తెల్లవారుజామున యావత్మల్ లో 4 మంది వలస కార్మికులు మరణించారు, 15 మంది గాయపడ్డారు. ఈ బస్సు సోలాపూర్ నుండి జార్ఖండ్ వెళ్తున్నట్టు అధికారులు వివరించారు. అయితే గాయపడిన వారిలో కొంత మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: