లాక్ డౌన్ ని క్రమంగా ఎత్తేస్తున్న తరుణంలో వరుస ప్రమాదాలు ఇప్పుడు ప్రజలను భయపెడుతున్నాయి. తాజాగా కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఒక ఘటన విషాదంగా మారింది. బూర్గం పాడు మండలం లక్ష్మీ పురంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. 

 

వివరాల్లోకి వెళితే కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని లక్ష్మీ పురంలో ముగ్గురు వ్యక్తులు చెరువులో స్నానానికి వెళ్ళారు. ఈత కొట్టడం రాక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు నల్లమోతు తేజు, అప్పారావు, వినయ్ గా గుర్తించారు అధికారులు. వీరు ముగ్గిరిలో ఇద్దరు 18 ఏళ్ళ యువకులు కాగా  ఒకరికి 19 ఏళ్ళు. దీనితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: