ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఇప్పుడు అంఫాన్ తుఫాన్ ఆందోళన కలిగిస్తుంది. అత్యంత వేగంగా ఇది దూసుకు రావడం తో శ్రీకాకుళం సహా అనేక తీర ప్రాంతాల్లో ఇప్పుడు ప్రజలు భయపడుతున్నారు. నెల్లూరు శ్రీకాకుళం విశాఖ సహా అనేక ప్రాంతాల్లో సముద్రం ముందుకు దూసుకు వచ్చింది. దీనితో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

శ్రీకాకుళం జిల్లాలోని రెండు మండలాల్లో సముద్రం ముందుకు రావడం తో ఆ ప్రాంతాన్ని అధికారులు ఖాళీ చేయించారు. ఇక నెల్లూరు కృష్ణ పట్నం కాకినాడ పోర్ట్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది. దీనిపై అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడిక్కడ రక్షణ చర్యలను ఏర్పాటు చేస్తున్నారు. అటు మత్స్య కారులు కూడా తమ పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: