దేశంలో కరోనా భయంకరంగా విజృంభిస్తుంది.  ముఖ్యంగా మహరాష్ట్రలో అయితే దీని ప్రభావం బీభత్సంగా ఉంది.  ఈ వైరస్ వ్యాప్తికి ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నా కొత్త కేసుల నమోదు మాత్రం ఆగలేదు.  1897 నాటి అంటు వ్యాధుల చ‌ట్టంలోని సెక్ష‌న్ 2తోపాటు, 2005 నాటి విప‌త్తు నిర్వ‌హ‌ణ చ‌ట్టం ప్ర‌కారం లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. మూడో విడ‌త లాక్‌డౌన్ గ‌డువు మే 17వ తేదీతో ముగిసింది.  ఇప్పుడు దేశ వ్యాప్తంగా 4.0 లాక్ డౌన్ మొదలైంది. మహారాష్ట్రలో రోజూ వందల సంఖ్యలో ఇక్కడ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలు సడలించడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తేల్చి చెప్పారు.  లాక్‌డౌన్ వల్ల వైరస్‌ను నియంత్రించగలిగినా.. దాని గొలుసును విడగొట్టలేకపోతున్నామని అన్నారు.

 

వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని ఉద్ధవ్ తెలిపారు. నిబంధనల సడలింపు అంశాన్ని కేంద్రం.. రాష్ట్రాలకే వదిలేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌జోన్‌లో ఉన్నవారు దయచేసి బయటకు రావాలని, పరిశ్రమల్లో మానవ వనరుల అవసరం ఎంతో ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి.. ప్రధాని మోదీ భాషలో అభ్యర్థిస్తున్నానని, ఆత్మనిర్భర్ భారత్ కావాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వలస కూలీలు స్వగ్రానికి వెళ్లిన నేపథ్యంలో వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు స్థానికులు బయటకు రావాలని ఉద్ధవ్ కోరారు. లాక్ డౌన్ సందర్బంగా పాత నియమాలే వర్తిస్తాయని.. అనుమతి లేకుండా తిరిగే వాహనాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: