తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణా లో 54 లక్షల జన ధన్ ఖాతాల్లో డబ్బులు పడలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ భాష ఉపయోగించే శక్తి తమకు లేదని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మీడియా మోడీ ని కీర్తిస్తుంటే కేసీఆర్ తిడుతున్నారని మండిపడ్డారు. 

 

ఉపాధి హామీ నిధులను కాకతీయ మిషన్ కి వాడుకోలేదా అని ప్రశ్నించారు. పేదలకు కేంద్రం 25 కేజీల బియ్యం ఇవ్వలేదా అని ఆయన నిలదీశారు. పంటల సాగు విషయంలో మీ విధానాలను మేము వ్యతిరేకిస్తున్నామా అని ఆయన నిలదీశారు. ప్రధాని ఒక నియమం పెడితే దాన్ని విమర్శిస్తారా అని ప్రశ్నించారు. మూస పద్దతిలో పాలన ఉండకూడదు అని మోడీ భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: