ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నియంత్రణ విషయంలో ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ సిఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. మద్యం వినియోగాన్ని బాగా తగ్గించే కార్యక్రమాలు చేసామని, మద్యం షాపులను తగ్గించామని, బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్ లు ఎత్తివేసామని సిఎం అన్నారు. 

 

అలాగే మద్యం అమ్మే సమయాన్ని కూడా కుదించామని ఆయన పేర్కొన్నారు. లిక్కర్ అండ్ ఇసుక మీద యువ ఐఏఎస్ లను పెట్టామని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసారు. తనకు ఓటు వేయని వారు అయినా పర్వాలేదు అర్హత ఉన్న వాళ్లకు పథకాలు అందాలి అని చెప్తున్నామని పేర్కొన్నారు. మద్యం విషయంలో రానున్న రోజుల్లో ఇంకా కఠినం గా వ్యవహరిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: