దేశ వ్యాప్తంగా ఇప్పుడు లాక్ డౌన్ ని కొనసాగించడం తో వలస కార్మికులు సొంత ఊర్లకు వెళ్ళడానికి నానా కష్టాలు పడుతున్నారు. తాజాగా ముంబై లోని బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోగా కర్ణాటక లో కూడా అలాంటి పరిస్థితే పోలీసులకు ఎదురైంది. దాదాపు 400 మంది వలస కూలీలు ఒక కాలేజి దగ్గరకు. వచ్చేశారు. 

 

తమ స్వస్థలాలకు తిరిగి పంపించాలని డిమాండ్ చేస్తూ 400 మంది వలస కార్మికులు ఈ రోజు మంగళూరులోని మిలగ్రెస్ కళాశాల ముందు నిరసన తెలిపారు. పోలీసు కమిషనర్ డాక్టర్ పి ఎస్ హర్ష సంఘటన స్థలాన్ని సందర్శించి వారి తో మాట్లాడటం తో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. వారిని త్వరలోనే పంపిస్తామని చెప్పారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: