ఎక్కడో ఊరు వాడా తెలియని చోట ఎవరినో నమ్ముకుని వేలాదిగా వెళ్లిపోతు ఉంటారు వలస కార్మికులు. సొంత ఊరిలో ఉంటే ఇప్పుడు పనులు లేక వాళ్ళు పడే అవస్థలు అన్నీ ఇన్ని కాదు. అందుకే దేశం నలుమూలల కూడా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు వెళ్తూ ఉంటారు. ఇక ఇప్పుడు చాలా మంది తమ సొంత ఊర్లకు వెళ్ళిపోతున్నారు.
తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది... అది ఏంటీ అంటే నాగ్పూర్లో పనిచేసి... ఇప్పుడు సొంత ప్రాంతానికి వెళ్ళిపోయినా మధ్యప్రదేశ్ లో సియోని దగ్గర ఉండే రిడ్డి గ్రామానికి చెందిన 40 మంది వలస కార్మికులు-ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కింద వారి గ్రామంలో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా అక్షయ్ అనే కార్మికుడు మాట్లాడుతూ... "మేము ఇక్కడ తక్కువ సంపాదిస్తాము, కాని మేము సంతోషంగా ఉన్నాము. బయట మాకు ఏదైనా జరిగితే, కుటుంబాలు బాధపడతాయని పేర్కొన్నాడు.
MP: Around 40 migrant workers-residents of Seoni's Riddi village who used to work in Nagpur&have returned home now-are working at their village under MGNREGS. A worker akshay says "We earn less here but we're happy. If something happens to us outside,families will be distressed" pic.twitter.com/H9qpQpUUfu
— ANI (@ANI) May 19, 2020