అసలు తెలంగాణా ఏర్పడిందే నీళ్ళు నిధులు నియామకాల కోసం అని తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణకు అన్యాయం చేయవద్దు అని కేసీఆర్ ని కోరుతున్నామని ఆయన విజ్ఞప్తి చేసారు. ఏదో ఉద్దరిస్తాడు అని కేసీఆర్ ని రెండో సారి సిఎం ని చేసారు అని ఆయన ఎద్దేవా చేసారు. 

 

అదే విధంగా పోతిరెడ్డి పాడు ని ఆ నాటి కాంగ్రెస్ నేతలు అందరూ కూడా వ్యతిరేకించారు అని ఆయన గుర్తు చేసారు. కేసీఆర్ తెలంగాణకు జగన్ తో కలిసి అన్యాయం చేస్తున్నారు అని ప్రెస్ మీట్ లో కొట్టేసినంత మాత్రాన ఇది అంత సిల్లీ వ్యవహారం కాదని పేర్కొన్నారు. పోతిరెడ్డి పాడు సామర్ధ్యం కేసీఆర్ కి తెలియకుండా పెరగదు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: