ఇప్పుడు లాక్ డౌన్ లో చాలా మంది నరకం చూస్తున్నారు. తినడానికి తిండి లేక వస్తలు పడుతున్నారు. చాలా మందికి ఇప్పుడు ఆర్ధికంగా అప్పుల పాలు అయిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనితో ఆర్ధిక కష్టాలు తట్టుకోలేని కొందరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. 

 

వరుసగా అప్పులు ఒక దాని తర్వాత ఒకటి మీద పడటం తో ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితిలో ఉన్నారు. తాజాగా మెదక్ జిల్లా మూసాయి పేటలో దంపతులు రైలుకి ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్ధిక ఇబ్బందులే వారి మరణానికి కారణం అని సమాచారం. పిల్లలను పోషించలేక అప్పులు కట్టలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అని సమాచారం. కేసు నమోదు చేసారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: