ఇప్పుడు కరోనా వైరస్ వచ్చి తగ్గిన వాళ్ళకే మరోసారి వస్తుంది అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ఈ కేసులు ఎక్కువగా బయటకు వస్తున్నాయి. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి విశాఖలో జరిగింది. ఒక వ్యక్తికి రెండు సార్లు కరోనా వచ్చింది. 

 

ఏప్రిల్ 1 న ముంబై నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి కరోనా వచ్చింది అని గుర్తించారు. ఆ తర్వాత వైద్యం చేయగా అతను కరోనా నుంచి బయటపడ్డాడు. కుటుంబ సభ్యులు అందరికి కరోనా వచ్చింది. ఒకసారి కరోనా వస్తే యాంటీ బాడీస్ తో ఎదుర్కొనే శక్తి ఉంటుంది అని మళ్ళీ రాదు అని అన్నారు. కాని అతనికి రెండు సార్లు కరోనా వచ్చింది. ఈ సారి కుటుంబ సభ్యుల నుంచి  కరోనా వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: