ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ ని ఉల్లంఘిస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా ఈ మధ్య కాలంలో వినపడుతున్నాయి. కరోనా తీవ్రతకు వారే కారణం అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే వారిపై హైకోర్ట్ లో ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సహా పలువురిపై హైకోర్ట్ లో ఫిర్యాదులు చేసారు. 

 

తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై హైకోర్ట్ లో ఫిర్యాదు చేసారు లాయర్ ఇంద్రనీల్. లాక్ డౌన్ ని ఉల్లంఘించారు అని ఆయన ఆరోపించారు. విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఉండవల్లి శ్రీదేవి పై ఆయన కోర్ట్ లో ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ ఉల్లంఘన వీడియో లను కూడా కోర్ట్ కి అందించారు. దీనిపై కోర్ట్ రేపు విచారణ చేపడతామని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: