ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఎక్కువ మొత్తంలో అధికార బదిలీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమ ప్రభుత్వానికి సానుకూలంగా ఉండేలా ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా ఉండేలా అధికారుల బదిలీలు చేపడుతుంది జగన్మోహన్ రెడ్డి సర్కార్ . ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఒకే సమయంలో ఏకంగా 16 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి సర్కార్. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఈ కింద బదిలీ ఐఏఎస్ అధికారుల వివరాలు ఉన్నాయి....బీసీ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్గా కె. ప్రవీణ్ కుమార్,
రజత్ భార్గవ్కు అదనంగా పర్యాటకం, సాంస్కృతిక శాఖలు...
క్రీడలు, యువజనసంక్షేమం ప్రిన్సిపల్ సెక్రటరీగా కె. రామ్గోపాల్...
ఎస్టీ వెల్ఫేర్ గిరిజనసంక్షేమం సెక్రటరీగా కాంతిలాల్ దండే...
సర్వే, లాండ్ సెటిల్మెంట్స్ డైరెక్టర్గా, సిద్ధార్థజైన్కు అదనపు బాధ్యతలు....
మత్స్యశాఖ కమిషనర్గా, కన్నబాబుకు అదనపు బాధ్యతలు...
ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా జి.శ్రీనివాసులు...అనంతపురం జేసీ(అభివృద్ధి)గా ఎ.సిరి...
సివిల్ సప్లైస్ డైరెక్టర్గా దిల్లీరావు...
శాప్ ఎండీగా వి.రామారావుకు అదనపు బాధ్యతలు...
దేవాదాయశాఖ స్పెషల్ కమిషనర్గా పి.అర్జున్రావు...
సీతంపేట ఐటీడీఏ ఈవోగా చామకూరి శ్రీధర్...
నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా స్వప్నిల్ దినకర్...
కాకినాడ మున్సిపల్ కమిషనర్గా సునీల్కుమార్రెడ్డి...
ఫైబర్ నెట్ ఎండీ ఎం. మధు సూదన్ రెడ్డి...
ఏపీ ఎండీసీ ఎండీ(ఇంచార్జ్)గా వీజీ వెంకట్రెడ్డి లు బదిలీ అయ్యారు.