ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే ప్రభుత్వం మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల పూర్తి చేసే విషయంలో వెనక్కు తగ్గడం లేదు. సిఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు వాటి పరిస్థితి గురించి అధికారులతో సంబంధిత శాఖా మంత్రి తో మాట్లాడుతూనే ఉన్నారు. ఇక మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షించడానికి గానూ వెళ్లనున్నారు. 

 

పోలవరం ప్రాజెక్ట్ పునరావాస గ్రామాలను కూడా ఆయన సందర్శించి అక్కడి అధికారులతో మాట్లాడతారు. ఇక పనుల మీద సమీక్షా సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఎక్కడి వరకు పనులు అయ్యాయి అనేది ఆయన స్వయంగా తెలుసుకుని వలస కార్మికుల గురించి కూడా ఆరా తీసే అవకాశం ఉందని సమాచారం. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: