వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కి కూడా విమానాలు వస్తున్నాయి. విజయవాడ లోని గన్నవరం విమానాశ్రయానికి లండన్ నుంచి విమానం రానుంది. లాక్ డౌన్ తర్వాత గన్నవరం వచ్చే తొలి విమానం ఇదే కావడం విశేషం. 

 

లండన్ నుంచి ముంబై చేరుకొని ముంబై నుంచి గన్నవరం చేరుకుంది. ఇందులో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరు అందరికి కూడా మెడికల్ టెస్ట్ లను నిర్వహిస్తుంది ప్రభుత్వం. ఆ తర్వాత అందరిని పెయిడ్ క్వారంటైన్ కి తరలిస్తారు. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక విశాఖ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: