ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. ఏపీ పోతిరెడ్డి పాడుపై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై స్టే ఇచ్చింది. ప్రతిపాదిత ప్రాజెక్ట్ పై అధ్యయనానికి కమిటి వేసింది. రెండు నెలల్లో అధ్యయన కమిటి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. 

 

ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే తెలంగాణా అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. తదుపరి విచారణ వరకు ప్రాజెక్ట్ ని చేపట్టవద్దు అని స్పష్టం చేసింది.  కమిటీ లో పర్యావరణ శాఖ పీసీబీ హైదరాబాద్ ఐఐటి సభ్యులను చేర్చింది. అదే విధంగా కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు సీనియర్ సభ్యుడిని కూడా చేర్చింది. ఇక ప్రాజెక్ట్ కి సంబంధించి జీవో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: