ఒక పక్క ఆపరేషన్ ఆల్ అవుట్ తో ఉగ్రవాదులను భారత బలగాలు కాల్చి చంపుతున్నా కాశ్మీర్ లో ఉగ్రవాదులు మాత్రం ఆగడం లేదు. తాజాగా శ్రీనగర్ లో ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. శ్రీనగర్ లో సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 

 

వీరు ఇద్దరూ బోర్డర్ సెక్యురిటి ఫోర్స్ కి చెందిన ఉగ్రవాదులు అని ఆర్మీ అధికారులు వివరించారు. ఇక కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాదులు ఆర్మీ నుంచి ఆయుధాలను లాక్కుని పరారు అయ్యారని వెల్లడించారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి భారత బలగాలు. ఇటీవల వరుస దెబ్బలు ఉగ్రవాదులకు తగులుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: