ఆంధ్రప్రదేశ్ లో బిల్డ్ ఏపీ మిషన్ లో భాగంగా ఏపీ సర్కార్ భూములు అమ్మడంపై ఇప్పుడు రాష్ట్రంలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి జరగడం లేదని ఆంధ్రప్రదేశ్ ని అమ్మేస్తున్నారని అమ్ముకుంటూ పోతే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులకు సమాధానాలు ఎవరు చెప్తారని విమర్శలు వస్తున్నాయి. 

 

దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆదాయం పెంచుకోవడానికి వనరులు వాడుకోక తప్పదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాము రాష్ట్రాన్ని అమ్మడం లేదని ఆయన స్పష్టం చేసారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటివి జరుగుతాయని అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల ఆరోపణలు చేసారు. చాలా రాష్ట్రాలు ఇదే పద్దతిని అవలంభిస్తున్నాయి అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: