లాక్ డౌన్ సమయంలో భార్యా భర్తల మధ్య తరుచుగా ఏదోక గొడవలు వస్తున్నాయి అనే వార్తలు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చదువుతున్నాం. చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి ఉందని వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఆర్ధిక ఇబ్బందులతో చాలా మంది ఇప్పుడు ఒత్తిడిలో ఉండి గొడవలు పడుతున్నారు. 

 

తెలంగాణాలోని మేడ్చల్ జిల్లా షామీర్ పేటలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలాతో గొడవ పడి ఇద్దరు పిల్లలు విషం ఇచ్చి ఆ తర్వాత తాను కూడా తాగింది ఒక తల్లి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 4 ఏళ్ళ గౌరవ్ 3 ఏళ్ళ కౌశిక్ మరణించారు. తల్లి పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: