తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. గత మూడు రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినా ఈరోజు కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈరోజు రాష్ట్రంలో 27 కొత్త కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1661కు చేరింది. ఈరోజు నమోదైన కేసుల్లో 15 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. 
 
మిగిలిన కేసులలో ఎక్కువమంది వలస కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ అనూహ్యంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతూ ఉండటంతో ఆ ప్రాంతం మినహా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులను అమలు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: