ఉత్తరప్రదేశ్లో శివసేన నేత దారుణ హత్యకు గురయ్యాడు. శివసేన రాంపూర్ జిల్లా మాజీ అధ్యక్షుడు అనురాగ్ శర్మ(40)ను ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్లోని జ్వాలానగర్లో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన వెంటనే శర్మను ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు.
శర్మ నిన్న రాత్రి స్కూటర్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు దుండగులు కాల్చిచంపారు. కాగా శర్మను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లిన సమయంలో వైద్య సిబ్బంది అందుబాటులో లేరని ఆగ్రహించి కుటుంబ సభ్యులు ఆస్పత్రిపై దాడి చేసి ధ్వంసం చేశారు. నిందితుల ఆచూకీకి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ గౌతమ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.