లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు రకరకాల పనులతో అభిమానులను అలరిస్తున్నారు. కొందరి పాత ఫోటోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలు కొందరు స్వయంగా చిన్ననాటి జ్ఞాపకాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ని సంతోషపరుస్తున్నారు. అలానే కొన్ని ఫ్యాన్ క్లబ్స్ కూడా త్రోబ్యాక్ పిక్స్ని సోషల్ సైట్స్లో పోస్ట్ చేస్తున్నారు. ఇక ఇవి నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా.. బాలీవుడ్ తార ఐశ్వర్యరాయ్ 1994లో మిస్ వరల్డ్ టైటిల్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఐశ్వర్యరాయ్ ఎంతో భావోద్వేగానికి లోనైందట. అవార్డ్ అందుకున్న తర్వాత మిస్ వరల్డ్ కిరీటంతోనే తల్లితో కలిసి భోజనం చేసింది. పింక్ కలర్ శారీ ధరించిన ఐష్ పక్కన ఆమె తల్లి బృందా రాయ్ కూడా ఉంది. ఆ నాటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.