ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరెంట్ చార్జీలను పెంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలే లాక్ డౌన్ వలన పనుల్లేక పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే... ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా కరెంటు శ్లాబులు మార్చి, చార్జీలు పెంచి వాళ్ళ మీద బిల్లుల భారం మోపడం అన్యాయమని ఆయన ట్వీట్ చేసారు.

 

విద్యుత్ చార్జీలు పెంచేది లేదని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇలా చేయడం మోసం లాక్ డౌన్ నేపథ్యంలో 3 నెలల విద్యుత్ బిల్లులు రద్దుచేయాలని డిమాండ్ చేసారు. ఆ తర్వాత కూడా పాత శ్లాబు విధానంలో చార్జీలు వసూలు చేయాలని కోరారు. కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న నిరసనలకు ప్రజలు మద్దతు తెలపాలన్నారు చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: