పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన కార్యకర్త ఆత్మహత్యా ప్రయత్నం చేసాడు. అతని పేరు లోకేష్ నాయుడు అని పోలీసులు వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ లో లోకేష్ పురుగుల మందు తాగాడు. దీనితో వెంటనే అప్రమత్తమయ్యారు పోలీసులు. 

 

లోకేష్ ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అయితే ఈ రెడ్ జోన్ పరిధిలో ఆసుపత్రి ఉండడంతో, మెరుగైన చికిత్స నిమిత్తం ప్రవేటు ఆసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కాని అందుకు పోలీసులు అంగీకరించడం లేదు. ఎమ్మెల్యేపై అతను పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: