గత రెండు నెలలుగా సినిమా షూటింగ్ లు సినిమాల విడుదల లేకపోవడంతో ఇప్పుడు సినీ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ నేపధ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ నేతృత్వంలో సినీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 

 

నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, స్రవంతి రవి కిషోర్, దర్శకులు కొరటాల శివ ఎన్ శంకర్, సురేందర్ రెడ్డి, త్రివిక్రమ్, హీరో నానీ, పలువురు హాజరయ్యారు. సినిమా షూటింగ్ మొదలైతే ఎం చెయ్యాలి అనే దాని మీద వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. అదే విధంగా సినిమా షూటింగ్ ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాళ్ళు ఈ సమావేశంలో చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: