జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆల్ అవుట్ కార్యక్రమం పేరుతో ఉగ్రవాదులను వరుసగా కాల్చి చంపుతున్నారు. గత ఆరు నెలల వ్యవధిలో దాదాపు 80 మంది ఉగ్రవాదులను కాల్చి చంపారు. గత నెలలోనే 30 మంది ఉగ్రవాదులను భారత బలగాలు కాల్చి చంపాయి. నిఘా వర్గాల సహకారం తో ఇప్పుడు పెద్ద ఎత్తున ఆపరేషన్ లు నిర్వహిస్తున్నారు. 

 

తాజాగా ఉగ్రవాదులకు మరో షాక్ తగిలింది. కుప్వారా జిల్లాలోని సోగం వద్ద కొత్తగా నియమించిన ముగ్గురు ఉగ్రవాదులను ఉమ్మడి దళాలు అరెస్టు చేశాయి. తదుపరి దర్యాప్తు జరుగుతోందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు మీడియాకు వివరించారు. మరో పది మంది ఉగ్రవాదుల జాబితాను కూడా విడుదల చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: