మాజీ ప్ర‌ధాని రాజీవ్‌గాంధీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నివాళులు అర్పించారు. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. అలాగే.. దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రాజీవ్‌గాంధీ విగ్ర‌హాలు, చిత్ర‌ప‌టాల‌కు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

 

40 ఏళ్ల‌ వయసులోనే రాజీవ్ గాంధీ ఆరవ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. మే 21, 1991 న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టిటిఇ) ఆత్మాహుతి దళం హత్య చేసింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: