ఎంఐంఎం చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని... భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అక్బరుద్దీన్ ఆ నిబంధనలను ఉల్లంఘించారు. బీహార్ వెళ్తున్న వలస కూలీలు ఉన్న ఆర్టీసీ బస్సు ఎక్కిన ఎమ్మెల్యే వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 
 
బస్సులో ప్రయాణిస్తున్న వారంతా మాస్కులు ధరించగా ఎమ్మెల్యే మాత్రం మాస్కు ధరించలేదు. సోషల్ మీడియాలో కొందరు దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ప్రజా ప్రతినిధి హోదాలో ఉండి ఎమ్మెల్యే మాస్క్ ధరించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు ప్రభుత్వం ఎమ్మెల్యేకు జరిమానా విధిస్తుందా...? అని ప్రశ్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: