కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నెల 11వ తేదీన పీఎం కేర్స్ ఫండ్స్ పై సోషల్ మీడియాలో సోనియా గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై కర్ణాటకలోని శివమొగ్గలో కేసు నమోదైంది. ఆ కామెంట్లు సోనియా గాంధీ ఖాతా నుంచి వచ్చినట్టు పోలీసులు గుర్తించటంతో ఆమెపై కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది. 
 
అడ్వకేట్ ప్రవీణ్ పీఎం కేర్స్ ఫండ్ ను కాంగ్రెస్ పార్టీ ఫ్రాడ్ అని ఆరోపించారని... పీఎం కేర్స్ ఫండ్ తో మోదీ విదేశాలకు వెళుతున్నారని కామెంట్లు చేశారని.. ప్రజలకు ఫండ్ ను వినియోగించడం లేదని లేదని ఆరోపించారని మీడియాకు చెప్పారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో పీఎం కేర్స్ ఫండ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: