తన భర్త కోసం అవసరం అయితే సుప్రీం కోర్ట్ కి అయినా వెళ్తా అని గాంధీ ఆస్పత్రిలో మృతి చెందిన మధుసూదన్ భార్య మాధవి ప్రకటించారు. తన భర్త చనిపోయారని ఎవరో చెప్తే తనకు తెలిసింది అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. తనకు చెప్పకుండా తన భర్తకు ఏ విధంగా అంత్యక్రియలు చేస్తారని ఆమె నిలదీశారు. 

 

తన బంధువులు అడిగితే తాను ఎం చెప్పాలని, అసలు తన భర్త మరణించారా లేక ఏదైనా ప్రయోగాలకు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. తన భర్తను స్వయంగా చూసి తాను గుర్తించాలని ఆమె స్పష్టం చేసారు. అనాథ శవం మాదిరి తన భర్తకు ఎందుకు అంత్యక్రియలు నిర్వహించారని ఆమె ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: