కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇప్పుడు అమెరికా కొందరు ఉగ్రవాదులను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే భారత్ కి చెందిన ఒక కరుడుగట్టిన ఉగ్రవాదిని అమెరికా విడుదల చేసింది. అతన్ని భారత్ కి ప్రత్యేక విమానంలో పంపిస్తుంది. 2015 లో అమెరికా పట్టుకున్న అల్ ఖైదా ఉగ్రవాది జుబేర్ మహ్మద్ ఇబ్రహీం ని విడుదల చేసారు. 

 

అతని క్వారంటైన్ పూర్తయిన తర్వాత అమెరికా బయటకు వదలడంతో... అతనిని ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలిస్తుంది. భారత విదేశాంగశాఖను అమెరికా సర్కార్ అలెర్ట్ చేసింది. ఇక అతనిది హైదరాబాద్ కావడంతో తెలంగాణా నిఘా వర్గాలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు నిధులను సమీకరించడం లో అతను కీలక పాత్ర పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: