తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. రాష్ట్రంలో ఈరోజు 38 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1699కు చేరింది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు నమోదైన కేసులలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 
 
మిగిలిన కేసుల్లో ఎక్కువమంది వలస కార్మికులు అని తెలుస్తోంది. కేంద్రం శ్రామిక్ రైళ్ల ద్వారా వలస కార్మికులను సొంతూళ్లకు పంపుతూ ఉండటంతో రాష్ట్రానికి వలస కార్మికులు చేరుకుంటున్నారు. వారిలో కొంతమంది కరోనా భారీన పడుతున్నారు. రాష్ట్రంలో నిన్న కరోనా భారీన పడి తొలి పోలీస్ కరోనా మరణం నమోదైంది. మరోవైపు ఈరోజు రాష్ట్రంలో నలుగురు వలస కూలీలు లాక్ డౌన్ వల్ల సొంతూళ్లకు వెళ్లలేక ఆత్మహత్య చేసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: