లాక్ డౌన్ లో కాస్త సడలింపులు ఇవ్వడం ఆలస్యం జనాలు రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా సరే ఇన్ని రోజుల నుంచి ఇంట్లో ఉండి ఎం చెయ్యాలో అర్ధం కాక ఇప్పుడు బయటకు వచ్చే వారు ఎక్కువయ్యారు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోజు రోజుకి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 

 

తాజాగా హైదరాబాద్ లో ఒక ప్రమాదం జరిగింది. మెహదీపట్నం మెట్రో పిల్లర్ నెంబర్ 33 ని ఒక యువకుడు కారులో అతి వేగంగా వచ్చి డీ కొట్టాడు. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడిక్కడే మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: