సత్యం వధ, ధర్మం చరా, అంటే, “నిజం మాట్లాడండి, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపండి .... అయితే ఎవరో ఒకరు (తల్లిదండ్రుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని) వ్యంగ్యంగా అన్నారు అంటూ సినీ నిర్మాత నాగబాబు ట్విట్టర్ లో ఆసక్తికర ట్వీట్ చేసారు. గత కొన్ని రోజులుగా ట్విట్టర్ లో ఏదోక ట్వీట్ చేస్తూ నాగబాబు సందడి చేస్తున్నారు.
ఆయన చేసే వ్యాఖ్యల మీద ఇప్పుడు పెద్ద దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఆయన గాంధీ మరణం విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేసారు. గాడ్సే ని కొనియాడటం కూడా వివాదాస్పదంగా మారింది దీనిపై రాజకీయ దుమారం కూడా రేగిన సంగతి తెలిసిందే. ఆయన ఈ ట్వీట్ ఎందుకు చేసారా అనేది ఆసక్తిగా మారింది.
Satyam vada,dharmam chara,means ,,speak the truth,,live righteous life....But some one said (keeping the parent situation)in a sarcastic manner ,,సత్యం చంపబడింది,ధర్మం చెరశాల పాలైనది...,,చాలా సార్లు ఈ saracasm నిజం అనిపిస్తుంది
— naga Babu konidela (@NagaBabuOffl) May 22, 2020