ఆంధ్రప్రదేశ్ లో కరోన కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. తగ్గినట్టే తగ్గిన కేసులు మళ్ళీ పెరగడం మొదలయ్యాయి. ఏపీలో కొత్తగా 62 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 728 ఉన్నాయి. దీనితో కేసుల సంఖ్య 2514 గా ఉంది. మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో 55 మంది ప్రాణాలు కోల్పోయారు. 

 

ఏపీలో కొత్తగా నమోదు అయిన కేసుల్లో కోయంబేడు లింకు లు ఉన్నాయని తెలుస్తుంది. ఇక కర్నూలు జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. కొత్త కేసుల్లో 18 కోయంబేడు లింకులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇక మరణాలు కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక 1731 మంది పూర్తిగా కోలుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: