చిన్న మధ్య తరగతి కంపెనీలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలబడింది. రెండు విడతల్లో దాదాపుగా 1100 కోట్లను ఏపీ సర్కార్ విడుదల చేయనుంది. నేడు తొలి విడతలో భాగంగా ఏపీ సర్కార్ 450 కోట్లను విడుదల చేసింది. వారికి ఆన్లైన్ లో ఈ నిధులను అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది ఈ రంగమే అని ప్రభుత్వం పేర్కొంది. 

 

వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గత ప్రభుత్వం ఇవ్వని వాటిని కూడా తాము ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం హయాంలో ఉన్న బకాయిలను తాము చెల్లిస్తున్నట్టు జగన్ వివరించారు. గత ప్రభుత్వం 828 కోట్లను ఇవ్వకుండా ఎగ్గొట్టిందని వాటిని కూడా తాము చెల్లిస్తున్నామని జగన్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: