వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామం లోని ఓ బావిలో మృతదేహాలు బయటపడటం ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మొదట ఒకే కుటుంబానికి చెందిన నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. 

 

 ఇక ఇప్పుడు ఈ రోజు ఉదయం నుంచి ఆ బావి నుంచి నీళ్లు తోడుతున్న కొద్దీ మరిన్ని  మృతదేహాలు బయటపడ్డాయి ఉన్నాయి. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏకంగా నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. ఇక పోలీసులు అక్కడ బావి నుంచి నీళ్లు తోడుతున్న కొద్దీ  ఒక్కో  మృతదేహ బయటపడుతూనే ఉంది. ఇలా కుప్పలు కుప్పలుగా మృతదేహాలు బయటపడడంతో అక్కడి స్థానిక ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఏం జరిగి ఉంటుంది అన్నది మాత్రం అర్థం కావడం లేదు. తాజాగా బయటపడిన మృతదేహంతో ఏకంగా మృతదేహాల సంఖ్య తొమ్మిదికి చేరింది. మరిన్ని మృతదేహాలు బయటపడే అవకాశం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: