వరంగల్ జిల్లాలో మృతదేహాల కలకలం మొదలయింది. ఒక కోల్డ్ స్టోరేజి ఆవరణలో ఉన్న బావిలో వరుసగా మృతదేహాలు బయటపడటం చూసి ఇప్పుడు స్థానికులు పోలీసు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  ఆ బావిలో ఇంకెన్ని బయటకు వస్తాయో అర్ధం కావడం లేదు. వీరిలో చిన్నారులు మహిళలు కూడా ఎక్కువగానే ఉన్నారు. 

 

ఇక ప్రస్తుతం ఈ మృతదేహాల పై విచారణ జరుగుతుంది. వారు అందరూ లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. ఇక స్థానిక యువకులతో వారికి గొడవ జరిగిందని వారిని విషం పెట్టి చంపేసి ఉండవచ్చు అని అంటున్నారు. అయితే కుటుంబం పెద్దది కావడం తోనే వారు ఉపాధి లేక పోషణ భారం భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అని అధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: