గత కొన్ని రోజుల నుంచి ట్విట్టర్ సాక్షిగా నటుడు, జనసేన నాయకులు నాగబాబు అధికార పక్ష నాయకులపై విరుచుకు పడుతున్నారు.   ఈ మద్యనే గాంధీ ని కాల్చిన నాధూరాం గాడ్సే ఒక దేశ భక్తుడే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు నాగబాబు. ‘అన్ని పశువులు గడ్డి తినవు మై డియర్ శ్రీను' అంటూ జనసేన నేత నాగబాబు తన ట్విట్టర్ ఖాతాలో ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకి సంబంధించిన ఓ ఫొటో పోస్ట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మద్య విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ సందర్భంగా  ప్రజలకు భరోసా కల్పించేందుకు పద్మనాభపురంలో ఇటీవల మంత్రి అవంతి నిద్ర చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, వైసీపీ నేతలు సైతం అక్కడ నిద్ర చేసి ప్రజలకు భరోసా కల్పించారు. 

తాజాగా ఈ విషయంపై స్పందించిన నాగబాబు.. 'అన్ని పశువులు గడ్డి తినవు మై డియర్ శ్రీను' అంటూ జనసేన నేత నాగబాబు తన ట్విట్టర్ ఖాతా పోస్ట్ చేశారు. అందులో అవంతి శ్రీనివాసరావు ఓ ఆవుకు గడ్డి తినిపిస్తోంటే అది తినకుండా అలాగే చూస్తూ నిలబడినట్లు ఉంది. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రజలకు తెలిపారు. ఆ సందర్భంగా ఆయన ఈ ఆవుకు గడ్డి తినిపిస్తూ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఫొటోలు దిగి పోస్ట్ చేశారు. అందులోని ఓ ఫొటోను నాగబాబు ఈ రోజు పోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: