సినిమా షూటింగ్ లు లేక సినిమాలు విడుదల లేక టాలీవుడ్ లో సినీ నటులు నిర్మాతలు ఇతర కార్మికులు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దేశంలో  లాక్ డౌన్ ని పెంచే అవకాశాలు కనపడుతున్నాయి. ఇదే గనుక కొనసాగితే మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. 

 

వేలాది మంది రోడ్డున పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపధ్యంలో సినీ ప్రముఖులు నిన్న మంత్రి తలసాని శ్రీనివాస్ తో సమావేశం అయ్యారు. ఇక సిఎం కేసీఆర్ తో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎప్పుడు సమావేశం అవుతారు అనేది ఇంకా స్పష్టత లేదు. లాక్ డౌన్ తర్వాత సినిమా షూటింగ్ లపై చర్చ జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: