దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మ‌హ‌మ్మారి రోజురోజుకూ మ‌రింత‌గా రెచ్చిపోతోంది. పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 660 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,319కి చేరింది. మరణాలు కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా 14 మంది మృతిచెందారు.

 

దీంతో మొత్తం మరణాల సంఖ్య 208కి చేరింది. అయితే, మొత్తం 12,319 కేసులలో ఇప్ప‌టివ‌ర‌కు 208 మంది మరణించారు. మిగతా వారిలో వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్న వారు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన వలస కూలీలు 5,897 మంది ఉన్నారని అధికార‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి. వీరంతా పోగా 6,214 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: