మహారాష్ట్రలో కరోనా వైరస్ విధ్వంసం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివవరకు సుమారు 42వేలకు చేరువలో పాజిటివ్ కేసులు ఉండగా.. దేశ వాణిజ్యరాజధాని ముంబైలోనే 25వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. ఇక్కడ కరోనా వైరస్ బారినపడుతున్న కొవిడ్వారియర్స్ సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతోంది.
తాజాగా ముంబైలో మరో ఇద్దరు పోలీసులు కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. దీంతో 16మంది పోలీసులు కరోనాకు బలయ్యారు. నిత్యం లాక్డౌన్ విధుల్లో ఉంటున్న పోలీసులు ఎక్కువగా వైరస్బారినపడుతున్నారు. ఈ పరిణామాలతో పోలీస్ కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.