ఈ లాక్ డౌన్ ఏమో గాని చాలా మంది తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు ప్రజలు ఇప్పుడు  ఆర్ధిక కష్టాలతో ఇబ్బంది పడే పరిస్థితి. కొంత మంది ఆత్మహత్యలు కూడా చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మరి కొంత మంది బ్రతకడానికి దొంగతనాలు కూడా చేస్తున్నారు. 

 

కొన్ని కొన్ని రాష్ట్రాల్లో దొంగతనాలు భారీగా జరుగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఒక దొంగతనం జరిగింది. అనంతపురం జిల్లా ధర్మవరం డిపో నుంచి భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి బెంగళూరు కి చెందిన ఒక వ్యక్తి బస్సుని ఎత్తుకెళ్ళాడు. సమాచారం అందుకున్న పోలీసులు కియా కంపెనీ వద్ద బస్సుని గుర్తించారు. అతని మీద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: